byసూర్య | Tue, Jan 22, 2019, 02:55 PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరారు. ఎర్రవల్లిలో రెండో రోజు యాగంలో పాల్గొని హారతి పూర్తయిన తర్వాత ఆయన మధ్యాహ్నం హైదరాబాద్కు వచ్చారు. అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరారు. ఢిల్లీలో కేంద్ర అటవీ, పర్యావరణశాఖల మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కుమారుడు మయాంక్ వివాహ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం తిరిగి రాత్రికి హైదరాబాద్కు వస్తారు.