byసూర్య | Tue, Jan 22, 2019, 02:51 PM
భోపాల్ : గత బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన భావాంతర్ యోజన ఆశించిన ఫలితాలనివ్వలేదని మధ్యప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సచిన్ యాదవ్ అన్నారు. అందుకే దాన్ని రద్దు చేశామని ఆయన చెప్పారు. భావాంతర్ యోజన ప్రవేశపెట్టిన తరువాత వ్యవసాయోత్పత్తుల ధరలు పడిపోయాయని, ప్రభుత్వం తీరు కూడా రైతులకు హాని కలిగించే విధంగా తయారైందని ఆయన అన్నారు. ఈ కారణంగానే ఆ పథకాన్ని రద్దు చేశామన్నారు.