byసూర్య | Tue, Jan 22, 2019, 01:42 PM
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్తో ఏపీ, తెలంగాణ నేతలు మంగళవారం ఉదయం భేటీ అయ్యారు. టీటీడీ అధికారులు, తెలుగు దేశం పార్టీ నాయకులే తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతికి పాల్పడుతున్నారని టీ.బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. టీటీడీలో అవినీతి రాజ్యమేలుతోందని దీనిపై విచారణ జరిపించాలని రెండు తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయకులు గవర్నర్ను కలిశారు. టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు