byసూర్య | Mon, Jan 21, 2019, 06:35 PM
సైబరాబాద్ : సైబరాబాద్ పోలీసులు మహిళలకు మాయమాటలు చెప్పి బంగారం దొంగిలించే చెడ్డీగ్యాంగ్, ఇరానీ గ్యాంగ్ ముఠా సభ్యుల గుట్టురట్టు చేశారు. చెడ్డీ గ్యాంగ్ ముఠాలో ఇద్దరిని పోలీసులు గుజరాత్ లో అరెస్ట్ చేశారు. వారి నుంచి బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యుల కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. సైబరాబాద్ పరిధిలో 8 కేసుల్లో చెడ్డీ గ్యాంగ్ నిందితులున్నారని మీడియా సమావేశంలో సజ్జనార్ తెలిపారు. నార్సింగితోపాటు ఐదు చోట్ల చెడ్డీ గ్యాంగ్ దోపిడీలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. అనుమానాస్పద వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ సూచించారు. ప్రతీ ఒక్కరు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.