byసూర్య | Mon, Jan 21, 2019, 05:48 PM
హైదరాబాద్: తెలంగాణ సీఎం కూతురు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఎంపిక అయ్యారు. ఫేమ్ ఇండియా మ్యాగజైన్ నిర్వహించిన సర్వేలో ఆదర్శ్ విభాగంలో ఉత్తమ పార్లమెంటేరియన్ గా కవితను ఎంపిక చేశారు. ఈనెల 31 న ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరగనున్న అవార్డుల ప్రధానోత్సవంలో కవిత అవార్డును అందుకోనున్నారు.