byసూర్య | Mon, Jan 21, 2019, 05:17 PM
తెలంగాణ బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పంచాయతీ రాజ్ చట్టాన్ని మార్చుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని కోరుతూ ఆర్ కృష్ణయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను సుప్రీం కొట్టేసింది. పిటిషన్ నిబంధనలకు అనుగుణంగానే ఉందన్న సుప్రీం దీనిమీద విచారణ అక్కర్లేదని రద్దు చేయాలని కోరిన పిటిషన్ ను కొట్టేసింది.