byసూర్య | Mon, Jan 21, 2019, 02:44 PM
ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరిగింది. ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 4,479 పంచాయతీల్లో 769 పంచాయతీలు.. 39,822 వార్డుల్లో 10,654 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 3,701 పంచాయతీలు, 28,976 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 12,202 మంది సర్పంచి అభ్యర్థులు, వార్డులకు 70,094 మంది బరిలో నిలిచారు. మిగతా రెండు విడతల పోలింగ్ ఈనెల 25, 30 తేదీల్లో జరగనుంది.