byసూర్య | Mon, Jan 21, 2019, 02:12 PM
బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వాన్ని అస్థిర పరచడానికి బిజెపి చేస్తున్న కుట్రలను భగ్నం చేయడానికే తాము రిసార్టుకు వచ్చామని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు చెప్పారు. ఎమ్మెల్యేలందరూ తమ తమ నియోజక వర్గాలకు తిరిగి వెళుతున్నారని ఆయన అన్నారు. తమ ప్రభుత్వానికి ఢోకా లేదని సుస్థిరంగా ఉంటుందని ఆయన అన్నారు.