byసూర్య | Mon, Jan 21, 2019, 10:38 AM
జగిత్యాల: ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన పోలింగ్ సిబ్బందిపై వేటు పడింది. సారంగపూర్ మండలం అర్పపల్లిలో బంధువుల ఇంట్లో విశ్రాంతి తీసుకోవడంతో పోలింగ్ సిబ్బందిని అధికారులు తొలగించారు. ఎన్నికల నిర్వహణకు వచ్చిన కొంతమంది పోలింగ్ సిబ్బంది ఆదివారం రాత్రి వారి బంధువుల ఇంట్లో బస చేశారని అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఎన్నికల విధులకు హాజరైన సిబ్బందిని వెంటనే మార్చాలని వారు డిమాండ్ చేశారు. అభ్యర్థుల ఆందోళనతో ఐదుగురు పోలింగ్ సిబ్బందిని అధికారులు తొలగించారు.