byసూర్య | Sun, Jan 20, 2019, 03:55 PM
లక్నో: కుంభమేళా ద్వారా ఉత్తరప్రదేశ్కు రూ.1.2 లక్షల కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ వెల్లడించింది. జనవరి 15న ప్రారంభమైన ఈ మెగా మేళా మార్చి 4 వరకు కొనసాగనుంది. ఇది నిజానికి మతపరమైన ఓ భారీ వేడుక అయినా దీనితో ముడిపడి ఉన్న ఆర్థిక కార్యకలాపాలు వివిధ రంగాల్లోని ఆరు లక్షల మందికిపైగా ఉపాధి కల్పిస్తున్నదని సీఐఐ తెలిపింది. 50 రోజుల కుంభమేళా నిర్వహణ కోసం యూపీ ప్రభుత్వం రూ.4200 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే. 2013లో జరిగిన మహా కుంభమేళా కంటే మూడు రెట్లు ఎక్కువ నిధులను ఈసారి ఇవ్వడం విశేషం. ఆతిథ్య రంగం 2 లక్షల 50 వేల మందికి, ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్స్ లక్షా 50 వేల మందికి, టూర్ ఆపరేటర్స్ 45 వేల మందికి, ఎకో టూరిజం, మెడికల్ టూరిజంలో 85 వేల మందికి ఈ కుంభమేళా ఉపాధి కల్పిస్తున్నట్లు సీఐఐ అధ్యయనం వెల్లడించింది.