కుట్రలు చేసేందుకు వచ్చిన అందరికీ ప్రజలు బుద్ధి చెప్పారు: అబ్దుల్‌ బలాలా

byసూర్య | Sun, Jan 20, 2019, 01:43 PM

ఈసారి ఎన్నికలు చాలా ప్రశ్నాంతంగా జరిగాయని ఎమ్మెల్యే అబ్దుల్‌ బలాలా అన్నారు. శాసనసభలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడా చిన్న ఘర్షణ కూడా లేకుండా ఎన్నికలు జరగడం చాలా సంతోషమన్నారు. ప్రచారానికి వచ్చిన బీజేపీ నేతలు అనుచితమైన వ్యాఖ్యలు చేశారన్నారు. ఎంఐఎం ముక్త తెలంగాణను చేస్తామంటూ… బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడారన్నారు. తెలంగాణలో కుట్రలు చేసేందుకు వచ్చిన అందరికీ ప్రజలు బాగా బుద్ధి చెప్పారన్నారు. భవిష్యత్‌లో ఫెడరల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ ముక్తభారత్‌ చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్‌ఎస్‌… ఎవరిక బి టీమ్‌ కాదు, అదొక విన్నింగ్‌ టీమ్‌ అన్నారు.


Latest News
 

తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు సెలవులు ప్రకటించిన ఇంటర్మీడియట్ బోర్డు Thu, Mar 28, 2024, 10:06 PM
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ముంబై లీలావతి హాస్పిటల్ ట్రస్ట్ బృందం Thu, Mar 28, 2024, 08:57 PM
పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM