byసూర్య | Sun, Jan 20, 2019, 01:39 PM
హైదరాబాద్: ఏది ఏమైనాసరే ఇచ్చిన వాగ్దానాలు వందకు వందశాతం గతంలో నెరవేర్చినట్టుగానే ఇప్పుడు కూడా నెరవేరుస్తామని హామీ ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్యే కొప్పుల శాసనసభలో ప్రతిపాదించారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి దాన్ని బలపరిచారు. అనంతరం కాంగ్రెస్ శాసనసభ్యులు గండ్ర వెంకట రమణారెడ్డి, మజ్లిస్ శాసనసభ్యులు బలాల, బీజేపీ నుంచి రాజాసింగ్ చర్చలో పాల్గొన్నారు. అనంతరం సభానాయకుడు, సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. చర్చలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆచరించిన, అనుసరించిన, అవలంభించిన అన్ని విధానాలను ప్రజలు గత నాలుగున్నర సంవత్సరాలు పరిశీలించారు. అనంతరం మాత్రమే ప్రజలు తిరిగి అఖండ మెజార్టీ ఇచ్చి ఈ ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించారన్నారు.
ఇంత విశ్వాస్వాన్ని తమ మీద ఉంచినందుకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. గవర్నర్ ప్రసంగం పబ్లిక్ మీటింగ్లో కేసీఆర్ ప్రసంగం లాగా ఉందని కొంతమంది అన్నారు. వారి రాజకీయ పరిజ్ఞానానికి జాలిపడటం తప్ప చేయగలిగింది ఏమి లేదన్నారు. కేసీఆర్ ప్రసంగాన్ని ఆమోదించి, ఏ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపించినరో, ఆ పార్టీ మేనిఫెస్టో, అదే పాలసీ గవర్నర్ ప్రసంగంలో ఉంటదని సీఎం పేర్కొన్నారు.