byసూర్య | Sun, Jan 20, 2019, 10:47 AM
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. నాలుగో రోజు జరుగుతున్న ఉభయ సభలో ఇవాళ సభలలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నారు. శాసనసభలో కొప్పుల ఈశ్వర్ చర్చను ప్రారంభించనున్నారు. తీర్మానాన్ని వేముల ప్రశాంత్రెడ్డి బలపరనున్నారు. శాసన మండలిలో పల్లా రాజేశ్వర్రెడ్డి తీర్మానంపై చర్చ ప్రారంభించనున్నారు. తీర్మానాన్ని వెంకటేశ్వర్లు బలపరచనున్నారు. శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు.