byసూర్య | Sat, Jan 19, 2019, 07:04 PM
ప్రభుత్వం చేపట్టిన పనులన్నింటిని గవర్నర్ ప్రసంగంలో ప్రశంసించారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ ఫలాల ఫలితంగా రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిందన్నారు. గతంలో ఎన్నికలు అంటే.. మోచేతికి బెల్లంపెట్టి నాకించే విధంగా ఉండేవన్నారు. ఎన్నికల్లో ప్రజలకు చెప్పిన ప్రతి హామీని టీఆర్ఎస్ పార్టీ నెరవేర్చింది. వచ్చే ఐదేళ్లలో ప్రజలకు చేసేది ప్రజలకు స్పష్టంగా చెప్పామన్నారు. 10శాతం ఎస్టీ, 12 శాతం మైనారిటీ రిజర్వేషన్ లకు కేసీఆర్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని, ప్రజలను నమ్ముకున్న పార్టీ టీఆరెస్ పార్టీ...ప్రజలు తమపై పెట్టుకున్న ఆశలన్నింటిని తీరుస్తామని చెప్పారు.