అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో పాల్గొన ఎంపీ కవిత

byసూర్య | Sat, Jan 19, 2019, 11:55 AM

హెచ్‌ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సు జరుగుతోంది. ఈ సదస్సును ఇవాళ జాగృతి అధ్యక్షురాలు కవిత, అన్నాహజారే కలిసి జ్యోతి ప్రజల్వన చేసి ప్రారంభించారు. ఈ సదస్సుకు 135 దేశాల నుంచి 550 మంది ప్రతినిధులు హాజరయ్యారు. గాంధేయ మార్గంలో సుస్థిర అభివృద్ధి, ఆవిష్కరణలు అనే అంశంపై సదస్సు జరుగుతోంది. 


ఈ సందర్భంగా ఎంపీ కవిత మాట్లాడుతూ..ప్రపంచంలో ఉన్న సమస్యలన్నీ మనకు మనం సృష్టించుకున్నవే అని ఎంపీ కవిత తెలిపారు. ప్రపంచంలో ఏటా 22 వేల మంది చిన్నారులు చనిపోతున్నారు. సుస్థిర అభివృద్ధికి ఉత్సాహంగా పని చేయాల్సిన అవసరం ఉంది. మన వల్ల ఉద్భవించిన కొన్ని సమస్యలకైనా ఈ సదస్సులో పరిష్కారం లభిస్తుందని నమ్ముతున్నాను. యువత కలిసికట్టుగా పోరాటం చేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయి అని కవిత పేర్కొన్నారు.


Latest News
 

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య Thu, Mar 28, 2024, 04:37 PM
అత్తను హతమార్చిన అల్లుడికి షాక్ Thu, Mar 28, 2024, 04:35 PM
చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి Thu, Mar 28, 2024, 04:35 PM
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:33 PM
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి Thu, Mar 28, 2024, 04:32 PM