byసూర్య | Sat, Jan 19, 2019, 09:36 AM
హైదరాబాద్ : రాష్ట్ర రెండో అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ శనివారం ఉదయం 11.30 గంటలకు ప్రసంగిస్తారని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. గవర్నర్ ప్రసంగం అనంతరం శాసనసభ, శాసన మండలి బీఏసీ సమావేశం ఉంటుంది. వచ్చే ఐదేళ్ల ప్రణాళికలు, ప్రాధాన్యాలను గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం వివరించనుంది.