గజ్వేల్ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నా!: వంటేరు ప్రతాప్ రెడ్డి

byసూర్య | Fri, Jan 18, 2019, 03:23 PM

తాను తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)లో చేరుతున్నట్లు కాంగ్రెస్ నేత వంటేరు ప్రతాప్ రెడ్డి స్వయంగా ప్రకటించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ లో చేరుతున్నానన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ సమక్షంలో ఈ రోజు మధ్యాహ్నం టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటానని పేర్కొన్నారు. గజ్వేల్ నియోజకవర్గం అభివృద్ధి కోసమే టీఆర్ఎస్ లో చేరుతున్నానని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలోని గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు పోటీ చేసిన వంటేరు రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన తెరాస నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో ఆయన తిరిగి టీఆర్ఎస్ లోనే చేరనుండటం ఆసక్తికరంగా మారింది. అయితే వంటేరు టీఆర్ఎస్ వస్తానని చెప్పినా తాము చేర్చుకోబోమని పార్లమెంటు సభ్యుడు, టీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM