byసూర్య | Fri, Jan 18, 2019, 02:53 PM
చెన్నై : ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేంద్ర ప్రభుత్వం విద్యా రంగంలో, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాల్ చేస్తూ డీఎంకే మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని, రిజర్వేషన్లు పేదరికాన్ని నిర్మూలించే కార్యక్రమం కాదని పేర్కొంది. డీఎంకే కార్యనిర్వాహక కార్యదర్శి ఆర్ ఎస్ భారతి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ జనవరి 21 న విచారణకు వచ్చే అవకాశం ఉంది.