byసూర్య | Fri, Jan 18, 2019, 02:23 PM
హైదరాబాద్: నగరంలో ఆయుధాలు అక్రమ రవాణా చేస్తున్న అంతరాష్ట్ర నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎల్బీనగర్, మల్కాజ్గిరి ఎస్వోటీ పోలీసులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రెండు తుపాకీలు, రెండు రౌండ్ల బుల్లెట్లు, రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడు జాంషీర్ అలియాస్ హస్సాన్ కోసం ప్రత్యేక టీంను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ తెలిపారు. ఒక్కో పిస్టల్ను రూ. లక్షకు విక్రయిస్తున్నట్లు సమాచారం