byసూర్య | Fri, Jan 18, 2019, 08:22 AM
హైదరాబాద్,: హైదరాబాద్ ఆకాశవాణి కేంద్రం నుంచి రోజూ ప్రసారమయ్యే పాడి-పంట కార్యక్రమంలో చిన్నమ్మగా ఆబాలగోపాలాన్ని అలరించిన నిర్మలా వసంత్ (72) అనారోగ్యంతో చనిపోయారు. ఈనెల 8న ఆకాశవాణి కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆమె చివరిసారిగా ఉత్సాహంగా పాల్గొన్నారు. వ్యవసాయ కార్యక్రమమైనా అన్ని వర్గాల శ్రోతలను అలరించారు. ఆమె సేవలను గుర్తుచేసుకుంటూ ఆకాశవాణి సిబ్బంది ఘనంగా నివాళులర్పించింది.