byసూర్య | Fri, Jan 18, 2019, 08:19 AM
టీఆర్ఎస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని మానాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు మానాల మోహన్ అనుచరులు టీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి వారికి గులాబీ కండువా పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్ఎస్ లో చేరిన వారిలో డీసీసీ కార్యదర్శి లక్కాకుల రమేశ్, మాజీ సర్పంచ్ బుర్ర నారాయణ గౌడ్, నాయకులు కొమ్ముల రవీందర్ రెడ్డి, కోడూరి రమేశ్, లక్కాకుల స్వామి, నాయిని గణేశ్, అంగరేకుల మహేశ్, జైరాం నర్సయ్య, ఇండ్ల లస్మయ్య, అమర్ తదితరులు ఉన్నారు.