టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్

byసూర్య | Fri, Jan 18, 2019, 08:18 AM

 సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా టాస్ పది నిమిషాలు ఆలస్యమైంది. అయితే, అవి చిన్నపాటి చినుకులే కావడంతో ఆటపై ప్రభావం చూపించే అవకాశం లేదు. ఆసీస్‌తో జరిగిన రెండో వన్డేలో ఘోరంగా విఫలమైన టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్‌, కుల్దీప్ యాదవ్ స్థానంలో యుజ్వేంద్ర చాహల్, రాయుడు స్థానంలో కేదార్ జాదవ్‌లకు తుది జట్టులో చోటు కల్పించినట్టు కెప్టెన్ కోహ్లీ తెలిపాడు. అరోన్ ఫించ్ సేన రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. బౌలర్లు బెహ్రెండార్ఫ్, నాథన్ లియాన్ స్థానాల్లో బిల్లీ స్టాన్‌లేక్, ఆడం జంపాలను తుది జట్టులోకి  తీసుకుంది.


Latest News
 

చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM
కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ సిద్ధం Fri, Apr 19, 2024, 08:58 PM