byసూర్య | Thu, Jan 17, 2019, 05:55 PM
హైదరాబాద్ : శాసనసభాపతి ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. స్పీకర్ పదవికి పోచారం శ్రీనివాస్ రెడ్డి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. ఒకే ఒక నామినేషన్ దాఖలు కావడంతో స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నికను రేపు అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పదవికి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అసెంబ్లీ కార్యదర్శి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్తో పాటు విపక్ష నేతలు హాజరయ్యారు. సభాపతిగా పోచారం శ్రీనివాస్రెడ్డి గారి అభ్యర్థిత్వానికి అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది.