byసూర్య | Thu, Jan 17, 2019, 04:46 PM
హైదరాబాద్ : కూకట్పల్లిలో పార్థీ గ్యాంగ్ను కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. కార్ల అద్దాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న మహారాష్ట్రకు చెందిన దొంగల ముఠాను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఏడుగురు సభ్యుల ముఠా నుంచి రూ. 6.5 లక్షల విలువ చేసే ల్యాప్టాప్లు, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.