byసూర్య | Thu, Jan 17, 2019, 03:24 PM
హైదరాబాద్ : కులాల మధ్య చిచ్చు పెట్టింది చంద్రబాబేనని తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ… చంద్రబాబులా కుట్ర రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. త్వరలో కేసీఆర్ ఏపీకి వస్తున్నారని, అభివృద్ది ఎలా చేయాలో మా సీఎంను అడిగి తెలుసుకోండని అన్నారు. చంద్రబాబుపై ఏపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఏపీలో తప్పకుండా రాజకీయాలు చేస్తామన్నారు. అక్కడ మేము చెబితే వినే నాయకులున్నారన్నారు. బాబు లేకపోతే ఏపీ అభివృద్ది ఆగిపోతుందని బాబు అంటున్నారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ది ఏమిటో ప్రజలకు తెలుసన్నారు.