byసూర్య | Thu, Jan 17, 2019, 03:23 PM
హైదరాబాద్ : చర్లపల్లిలో పెట్రోల్ మాఫియా గ్యాంగ్ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు ఉండగా, మరో 8 మంది పరారీలో ఉన్నారు. ఐఓసీ, బీపీసీ డివిజన్ పైప్లైన్ల నుంచి డీజిల్ దొంగతనానికి పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా సభ్యుల నుంచి రూ. 90.40 లక్షలు, డీజిల్ ట్యాంకర్, బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.