byసూర్య | Thu, Jan 17, 2019, 01:00 PM
మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దైవసాక్షిగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణం చేయించారు. సీఎం కేసీఆర్ తోపాటు 118 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. వీరిలో ఆరుగురు మహిళలు కూడా ఉన్నారు. ఇక ఈ నెల 19న సభను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగిస్తారు. 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించి ఆమోదిస్తారు.