byసూర్య | Thu, Jan 17, 2019, 12:46 PM
సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రమాణ స్వీకారానికి గైర్హాజరయ్యారు. సర్పంచ్ ఎన్నికల బిజీ వల్ల రాలేకపోతున్నట్లు సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. తెలంగాణ లో టీడీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. అందులో సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర గెలుపొందారు. అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా అసెంబ్లీకి రాలేదు. అసెంబ్లీకి రానని రాజాసింగ్ ముందే ప్రకటించారు. స్పీకర్ ఎన్నిక పూర్తయిన తర్వాతే ప్రమాణం చేస్తానని రాజాసింగ్ చెప్పారు.