byసూర్య | Thu, Jan 17, 2019, 11:59 AM
హైదరాబాద్ : తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం ఆరుగురు మహిళలు ప్రమాణస్వీకారం చేశారు. ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రేఖానాయక్(టీఆర్ఎస్), డి.అనసూయ(సీతక్క)(కాంగ్రెస్), గొంగిడి సునీత(టీఆర్ఎస్), హరిప్రియ బానోతు(కాంగ్రెస్), పద్మా దేవేందర్ రెడ్డి(టీఆర్ఎస్), సబితా ఇంద్రారెడ్డి(కాంగ్రెస్) వరుసగా ప్రమాణస్వీకారం చేశారు.