byసూర్య | Thu, Jan 17, 2019, 07:44 AM
జిల్లాలోని దివిటిపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు, ఓ ఆర్టీసీ బస్సు ఒకదాన్ని మరోటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు బస్సు డ్రైవర్ను జడ్చర్లలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. బస్సు ఢీకొన్న లారీలో గ్యాస్ సిలిండర్లు ఉండటంతో బస్సులోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అవి పేలిపోతాయని భయపడ్డారు. వెంటనే బస్సు దిగి దూరంగా పరిగెత్తారు. సిలిండర్లు పేలకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోయాయి.