byసూర్య | Mon, Jan 14, 2019, 01:56 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు ఆదరణ లేదని తెలంగాణ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఏపీలో పర్యటిస్తున్న ఆయన ఇబ్రహీంపట్నంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో యాదవ సంఘం నేతలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఇళ్లలో కూర్చుంటే రాజకీయ అవకాశాలు రావన్నారు. ఏపీలో యాదవ రాజకీయ ఎదుగుదలకు అండగా ఉంటానన్నారు. చట్టసభల్లో అవకాశం ఇవ్వకుంటే ఎవరినైనా ఓడించాలన్నారు. ఏపీలో యాదవులకే కాదు.. బీసీలకూ నాయకత్వం వహించేందుకు సిద్దంగా ఉన్నానన్నారు.