byసూర్య | Mon, Jan 14, 2019, 01:10 PM
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత రాష్ట్ర ప్రజలకు భోగీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగ అందరికీ భోగభాగ్యాలను అందించాలని కోరుకుంటున్నానని తెలుపుతూ కేటీఆర్ ట్వీట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పట్టణాల్లో ఉన్న ప్రజలంతా గ్రామాల్లోకి వెళ్లడంతో.. పల్లెలన్నీ సందడిగా మారాయి.
భోగి పండుగ అందరికీ భోగభాగ్యాలను అందించాలని కోరుకుంటూ...#HappyBhogi pic.twitter.com/ukLGoF8sIz
— KTR (@KTRTRS) January 14, 2019