byసూర్య | Mon, Jan 14, 2019, 09:21 AM
హైదరాబాద్: టీ పోల్ యాప్కు లాగిన్ కావడం ద్వారా ఓటర్ స్లిప్లను పొందవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది. జిల్లా పేరు, ఎపిక్ నంబర్ను నమోదు చేసి ఓటర్లు ఈ స్లిప్లను పొందవచ్చని ఈసీ పేర్కొంది. రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి నేడు సూర్యాపేట జిల్లా పర్యటనలో ఉన్నారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై నోడల్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.