‘ఎవరు’ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు : మహేష్ బాబు

by సూర్య | Sun, Aug 25, 2019, 06:12 PM

అడవి శేష్ హీరోగా తెరకెక్కిన 'ఎవరు' సినిమా సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటుంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం బాగుందంటూ ట్విట్టర్ వేదికగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఎవరు’ సినిమా చూశా. అద్భుతమైన కాన్సెప్టుతో సీటు అంచున ప్రేక్షకుడ్ని ఉంచే థ్రిల్లర్‌ ఇది. బాగా డైరెక్ట్‌ చేశారు. సినిమా విజయం అందుకున్న నేపథ్యంలో అడివి శేష్‌, మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు’ అని మహేశ్‌ పోస్ట్‌ చేశారు. దీనికి అడివి శేష్‌ స్పందించారు. ‘ఆన్‌ అండ్‌ ఆఫ్‌ స్క్రీన్‌లో మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు సూపర్‌స్టార్‌. ‘మేజర్‌’ సినిమాతో కూడా మీరు గర్వపడేలా చేస్తానని ఆశిస్తున్నా’ అని అన్నారు. మహేశ్‌ నిర్మిస్తున్న ‘మేజర్‌’ సినిమాలో అడివి శేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM