కొండారెడ్డి బురుజు.. హైదరాబాద్ లో

by సూర్య | Sun, Aug 25, 2019, 01:17 PM

సూపర్ స్టార్ మహేష్  బాబు నటించిన 'ఒక్కడు' చిత్రం గురించి గాని, అందులో కొండారెడ్డి బురుజు సీన్ గురించి గాని తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా  చెప్పనక్కర్లేదు. అయితే మహేష్ మరో సరి హైదరాబాద్‌లో కొండారెడ్డి బురుజు వద్ద హీరోయిజం చూపించనున్నారు. అదేంటి.. కొండారెడ్డి బురుజు ఉండేది కర్నూలులో కదా? అనే సందేహం కలగకమానదు. అయితే మహేశ్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీలో కొండారెడ్డి బురుజుని క్రియేట్ చేసింది ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్. ప్రస్తుతం సినిమా షూటింగ్ రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతుంది. ఈ షెడ్యూల్ కోసం కర్నూలు కొండారెడ్డి బురుజు సెట్‌ను రూపొందించారు. మహేశ్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. అనీల్ సుంకర, దిల్‌రాజు, మహేశ్ నిర్మాతలుగా అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రూపొందుతోంది.


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM