శాటిలైట్ భాగస్వామిని ఖరారు చేసిన 'విశ్వంబర'

by సూర్య | Wed, Jun 18, 2025, 02:16 PM

మెగాస్టార్ చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని బింబిసార సినిమాతో ప్రఖ్యాతి గాంచిన వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. సోషియో-ఫాంటసీ థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి 'విశ్వంబర' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. అభిమానులు ఈ చిత్రం యొక్క అధికారిక విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి జోడిగా త్రిష కృష్ణన్ నటిస్తుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు ఛానల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఆషికా రంగనాథ్, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా, అశ్రిత వేముగంటి నండూరి మరియు కునాల్ కపూర్‌ల ఈ సినిమాలో కీలక పత్రాలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి అకాడమీ అవార్డ్-విజేత MM కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. విశ్వంబర సెప్టెంబర్ 25, 2025న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. UV క్రియేషన్స్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

Latest News
 
గబ్బర్‌సింగ్ నా జీవితాన్నే మార్చేసింది: శృతి హాసన్ Sat, Jul 12, 2025, 10:08 AM
దర్శకురాలిగా మారాలనుంది: ప్రియమణి Sat, Jul 12, 2025, 10:06 AM
'జూనియర్' ట్రైలర్ రిలీజ్ Sat, Jul 12, 2025, 07:53 AM
కొత్త తెలుగు రోమ్-కామ్ సిరీస్‌ను ప్రకటించిన జియో హాట్‌స్టార్ Sat, Jul 12, 2025, 07:44 AM
తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఓపెన్ అయ్యిన శంకర్ Sat, Jul 12, 2025, 07:29 AM