సీన్స్ మొత్తం నాలుగు రోజుల్లోనే షూట్
by సూర్య |
Wed, Aug 21, 2019, 08:30 PM
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు. కమెడియన్ బండ్లగణేశ్ కూడా ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే బండ్లగణేశ్కు సంబంధించిన సీన్స్ మొత్తం షూట్ చేశారట. నాలుగు రోజుల్లోనే ముగించారట. ఇందుకు సంబంధించిన రెమ్యునరేషన్ కూడా బండ్లగణేష్కు ఇచ్చేశారట. రోజుకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ. 20 లక్షల వరకూ బండ్లగణేశ్ అందుకున్నారు. 10 రోజుల పాటు షూటింగ్ ఉంటుందని బండ్ల గణేశ్ భావించారట. నాలుగు రోజుల్లో ముగించడాన్ని బండ్ల గణేశ్ అసలు ఊహించలేదట. షాక్కు గురయ్యారట.
Latest News