by సూర్య | Tue, Aug 20, 2019, 11:07 AM
సినీనటుడు తరుణ్ కారు ప్రమాదానికి గురైందని తెగ వార్తలు వస్తున్నాయి. రంగరెడ్డి జిల్లా అల్కాపురి టౌన్షిప్ వద్ద ఔటర్ రింగు రోడ్డుపై మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందనీ.. కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొందని ప్రచారం జరిగింది. ప్రమాద సమయంలో కారులో నటుడు తరుణ్ ఉన్నారంటూ.. అయితే ఈ ప్రమాదంలో అతడికి ఎటువంటి గాయాలు కాలేదని, ప్రమాదం అనంతరం తరుణ్ కారును అక్కడే వదలేసి వెళ్లిపోయారని వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలపై తరుణ్ అధికార ప్రతినిధి తాజాగా స్పందించారు. ఆ వార్త అవాస్తవమని కొట్టిపడేశారు. యాక్సిడెంట్ అయిన కారుకు తరుణ్కు ఎటువంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. గత రాత్రి నుంచి ఆయన ఇంటి వద్దే ఉన్నారని తెలిపారు. కారు కూడా బాగానే ఉందని పేర్కొన్నారు.
Latest News