by సూర్య | Mon, Aug 19, 2019, 11:13 PM
ఏ ఇండస్ట్రీ చూసినా.. వారసత్వం అనేది కామన్ అయిపోయింది. తాజాగా టాలీవుడ్లో మరో వారసుడు రాబోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్..రెండో తనయుడు బెల్లంకొండ సాయి గణేష్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్దం చేసుకుంటున్నాడు. ఇప్పటికే బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు బెల్లంకొండ శ్రీనివాస్ టాలీవుడ్లో హీరోగా ఆయన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో సాయి గణేష్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. పూర్తి ప్రేమకథగా తెరకెక్కబోయే ఈ సినిమాను దసరాకు పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ సినిమాను ‘హుషారు’ నిర్మాత బెక్కం వేణుగోపాల్తో కలిసి బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.
Latest News