by సూర్య | Mon, Aug 19, 2019, 03:03 PM
సస్పెన్స్, థ్రిల్లింగ్ కథా చిత్రాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అడివి శేష్. ‘క్షణం’, ‘గూఢచారి’ తరువాత ఇటీవల విడులైన ‘ఎవరు’ చిత్రంతో ఆయన మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. శేష్ ఇటీవల ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సినీ రంగంలో మొదటి నుంచి తనను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున, అల్లు అర్జున్, సమంత తనను అన్ని విధాలుగా ప్రోత్సహించారన్నారు. ఆ సందర్భంగా ఆ ముగ్గురికి ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం అడివి శేష్ ‘ఎవరు’ ప్రమోషన్స్లో పాల్గొంటున్నారు. అనంతరం ఆయన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా ఘట్టమనేని మహేశ్బాబు ఎంటర్టైన్మెంట్స్, ఏ ప్లస్ ఎస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్న ‘మేజర్’ చిత్రంలో నటించనున్నారు. ఇటీవల మహేష్బాబు ఈ చిత్రానికి సంబంధించి అడివి శేష్ ఫస్ట్ లుక్ను విడుదల చేశారు. మేజర్ ఉన్నికృష్ణన్ గెటప్లో అడివి శేష్ లుక్ ఆకట్టుకుంటోంది.
Latest News