by సూర్య | Sat, Aug 17, 2019, 11:27 AM
అడివి శేష్ హీరోగా వెంకట్ రాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎవరు’ చిత్రానికి మంచి టాక్ దక్కడమే కాదు.. ఈ సినిమాలో నటి రెజీనా నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో ఈ సినిమాకు మరింతగా బజ్ పెంచేందుకు జోరుగా ‘ఎవరు’ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. తాజాగా ‘ఎవరు’ ప్రమోషన్ లో భాగంగా ఒక ప్రెస్ మీట్ కు హాజరైంది. ఆ ప్రెస్ మీట్ కు ముందుగా ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలలో వీలైనంతగా గ్లామర్ ఒలికిస్తూ అందరినీ ఆకట్టుకుంది. గ్రీన్.. పింక్ కాంబినేషన్ లో ఉన్న ప్యాంట్ సూట్ ధరించింది. ఒక చేతికి ఫుల్ స్లీవ్ మరో చేతికి స్లీవ్ లెస్ గా కొంచెం వెరైటీగా కనిపిస్తోంది. అయితే క్లీవేజ్ అందాలను ఫుల్ గా ధారపోయడంతో ఫోటో యమా హాట్ గా మారిపోయింది. బుగ్గ మీద చెయ్యి పెట్టుకొని ఒక స్మైల్ కూడా ఇచ్చింది. ‘ఎవరు’ విజయం తో ఫుల్ గా రీఛార్జ్ అయింది కాబట్టి టాలీవుడ్ లో రెజీనా కు మరోసారి మంచి అవకాశాలు రావడం ఖాయమే.
Latest News