"సరిలేరు నీకెవ్వరు" సెట్ లోని ఫోటో వైరల్...

by సూర్య | Fri, Aug 16, 2019, 02:17 PM

అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ మహేశ్‌ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో మహేశ్‌కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం సెట్‌లో సరదాగా గడిపిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కథానాయిక రష్మిక, దర్శకుడు అనిల్‌ రావిపూడి, హరితేజ, సంగీత తదితరులు ఈ ఫొటోలో కనిపించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విజయశాంతి, ప్రకాశ్‌రాజ్‌, నరేశ్‌, రమ్యకృష్ణ, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్‌రాజు, మహేశ్‌బాబు, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కశ్మీర్‌ షెడ్యూల్‌ ఇటీవల పూర్తయింది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM