by సూర్య | Fri, Aug 16, 2019, 02:17 PM
అగ్ర కథానాయకుడు సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. ఈ సినిమాలో మహేశ్కు జోడీగా రష్మిక నటిస్తున్నారు. తాజాగా చిత్ర బృందం సెట్లో సరదాగా గడిపిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కథానాయిక రష్మిక, దర్శకుడు అనిల్ రావిపూడి, హరితేజ, సంగీత తదితరులు ఈ ఫొటోలో కనిపించారు. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విజయశాంతి, ప్రకాశ్రాజ్, నరేశ్, రమ్యకృష్ణ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్రాజు, మహేశ్బాబు, రామబ్రహ్మం సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కశ్మీర్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది.
Latest News