by సూర్య | Fri, Aug 16, 2019, 11:35 AM
`మహానటి` చిత్రంలో సావిత్రిగా అద్భుత నటనతో మైమరిపించిన కీర్తి సురేష్ `జాతీయ ఉత్తమ నటి`గా పురస్కారం దక్కించుకున్న సంగతి తెలిసిందే. కీర్తిపై సినీ పరిశ్రమ ప్రముఖుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. దుబాయ్ లో జరిగిన `సైమా అవార్డుల` వేడుకలో సావిత్రిని తలపించేలా సాంప్రదాయ చీరకట్టులో దర్శనమిచ్చిన కీర్తి సురేష్ ముఖ్య అతిధి హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఆశీస్సులు అందుకున్నారు. కీర్తి మెగాస్టార్ వద్దకు చేరుకుని ఎంతో వినమ్రంగా నవ్వులు చిందిస్తూ ముచ్చట్లాడారు. మెగాస్టార్ సైతం చిరునవ్వులు చిందిస్తూ తనకు ఆశీస్సులు అందిస్తున్న ఆ దృశ్యం కన్నులపండువగా కనిపిస్తోంది.
Latest News