ఖతర్లో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్
by సూర్య |
Thu, Aug 15, 2019, 09:08 PM
ప్రతి ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే సౌత్ ఇండియన్ ఇంటర్ నేషనల్ మూవీ అవార్డ్స్ కార్యక్రమం ఈసారి ఖతర్లోని దోహలో జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు సందీప్ వంగా, యంగ్ హీరో విజయ్ దేవరకొండ, కేజీఎఫ్ స్టార్ యష్ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషలకు చెందిన సినీ సెలబ్రిటీలకు గురువారం, శుక్రవారం అవార్డులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, మాలీవుడ్ మెగాస్టార్ మోహల్ లాల్ ముఖ్య అతిథులుగా హాజరుకాను న్నారు. ఇద్దరు మెగాహీరోలు పాల్గొంటుండటంతో ఈకార్యక్రమంపై ఆసక్తి నెలకొంది.
Latest News