'డ్యూడ్' తమిళనాడు అండ్ కర్ణాటక థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Fri, May 16, 2025, 05:13 PM

కోలీవుడ్ యువ నటుడు-దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ ఇటీవలే డ్రాగన్‌తో 100 కోట్ల గ్రాస్ ని అందుకున్న తరువాత నటుడు ప్రస్తుతం తెలుగు తమిళ ద్విభాషా చిత్రానికి పనిచేస్తున్నాడు. ఈ చిత్రానికి మేకర్స్ 'డ్యూడ్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ చిత్రం యొక్క టైటిల్ మరియు ఫస్ట్-లుక్ పోస్టర్ ని మేకర్స్ విడుదల చేయగా సానుకూల స్పందన వచ్చింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తమిళనాడు అండ్ కర్ణాటక థియేటర్ రైట్స్ ని రోమియో పిక్చర్స్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. యువ దర్శకుడు కీర్తిస్వారాన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని మైథ్రీ మూవీ మేకర్స్ బ్యానర్ క్రింద నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మామిత బైజు మహిళా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం పాన్-ఇండియా విడుదల కానుంది. సాయి భాంక్కర్ ఈ చిత్ర సంగీత స్వరకర్తగ ఉన్నారు. సీనియర్ నటులు శరత్ కుమార్, రోహిని మొల్లెటి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషలలో దీపావళి 2025 సందర్భంగా విడుదల కానుంది. 

Latest News
 
ఒక ట్విస్ట్‌తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన 'సిస్టర్ మిడ్నైట్' Wed, Jun 18, 2025, 08:04 AM
ప్రైమ్ వీడియో ట్రేండింగ్ లో 'ఎలెవెన్' Wed, Jun 18, 2025, 07:59 AM
150M+ స్ట్రీమింగ్ మినిట్స్ ని క్లాక్ చేసిన 'అనగనగా' Wed, Jun 18, 2025, 07:55 AM
ఆహా లో త్వరలో ప్రసారం కానున్న 'అలపుజా జింఖానా' Wed, Jun 18, 2025, 07:52 AM
'కుబేర' అడ్వాన్స్ బుకింగ్స్ కి భారీ స్పందన Wed, Jun 18, 2025, 07:47 AM