'SSMB29' విక్రమ్ కీలక పాత్ర?

by సూర్య | Wed, May 14, 2025, 07:33 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌలితో కలిసి చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా 'SSMB 29' అనే పేరు పెట్టారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. SSMB29 ను ప్రముఖ చిత్రనిర్మాత కెఎల్ నారాయణ 1,000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2027లో, రెండో భాగాన్ని 2029లో విడుదల చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌కు చెందిన కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. దేవా కట్ట డైలాగ్ రైటర్ గా, విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఉన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన స్వరకర్త MM కీరావాని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు.

Latest News
 
'ఆంధ్రుల అన్నపూర్ణ డోక్కా సీతమ్మ' ఆన్ బోర్డులో కేశావి Sat, Jun 14, 2025, 05:11 PM
నేడు విడుదలకి సిద్ధంగా ఉన్న 'కుబేర' ట్రైలర్ Sat, Jun 14, 2025, 05:06 PM
నేడే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ఈవెంట్ Sat, Jun 14, 2025, 04:53 PM
'VT15' తదుపరి షెడ్యూల్ కి సర్వం సిద్ధం Sat, Jun 14, 2025, 04:49 PM
'అందాల రాక్షసి' కోసం ఎక్స్ట్రా స్క్రీన్స్ Sat, Jun 14, 2025, 04:44 PM