'SSMB29' విక్రమ్ కీలక పాత్ర?

by సూర్య | Wed, May 14, 2025, 07:33 PM

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన తదుపరి చిత్రాన్ని ఎస్ఎస్ రాజమౌలితో కలిసి చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రానికి తాత్కాలికంగా 'SSMB 29' అనే పేరు పెట్టారు. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్నారు. SSMB29 ను ప్రముఖ చిత్రనిర్మాత కెఎల్ నారాయణ 1,000 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి భాగాన్ని 2027లో, రెండో భాగాన్ని 2029లో విడుదల చేయనున్నారు. దుర్గా ఆర్ట్స్‌కు చెందిన కెఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని నిర్మిస్తుంది. దేవా కట్ట డైలాగ్ రైటర్ గా, విజయేంద్ర ప్రసాద్ రచయితగా ఉన్నారు. ఆస్కార్ అవార్డు పొందిన స్వరకర్త MM కీరావాని ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు.

Latest News
 
సుకుమార్-రామ్ చరణ్ సినిమా.. DSPకి బ్రేక్? Sun, Mar 15, 2026, 11:56 AM
రేపే 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ Sat, Mar 14, 2026, 04:48 PM
నేడు విడుదల కానున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్రైలర్ Sat, Mar 14, 2026, 04:23 PM
రెండోసారి తల్లైన నటి పూర్ణ Sat, Mar 14, 2026, 04:22 PM
'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతున్న 'బూకీ' Sat, Mar 14, 2026, 04:22 PM