పూరి జగన్నాద్ - విజయ్ సేతుపతి చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటి

by సూర్య | Tue, May 13, 2025, 10:48 AM

ప్రశంసలు పొందిన దర్శకుడు పూరి జగన్నాద్ తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతితో జత కట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో జాతీయ అవార్డు గెలుచుకున్న నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు రాధికా ఆప్టే, నివేత థామస్, ఫహద్ ఫాజిల్ ముఖ్య పాత్ర కోసం చర్చలు జారుతున్నట్లు సమాచారం. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలతో త్వరలో ప్రొడక్షన్ ప్రారంభం కానుంది. తాజాగా ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమాలో బాలీవుడ్ నటి విద్య బాలన్ నటిస్తున్నట్లు ఫిలిం సర్కిల్ లో వార్తలు వినిపిస్తున్నాయి. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, పురిజగన్నాథ్ విద్యాబాలన్ కోసం ఈ సినిమాలో శక్తివంతమైన పాత్రను రాసినట్లు సమాచారం. ఆమె ఈ చిత్రంలో రాజకీయ నాయకురాలిగా కనిపిస్తుంది అని టాక్. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీలతో సహా పలు భాషలలో విడుదల అవుతుంది. ఇది పూరి  జగన్నాద్ మరియు విజయ్ సేతుపతికి ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ అవుతుంది. ఈ చిత్రానికి పూరి జగన్నద్ నటి-నిర్మాత ఛార్మి కౌర్‌తో కలిసి నిర్మించనున్నారు. 

Latest News
 
రామ్ చరణ్ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ ఆర్.రెహ్మాన్ “Peddi” సంగీతంతో హిట్ సెట్! Sat, Nov 08, 2025, 11:42 PM
“SSMB 29: మహేశ్ బాబు ఫ్యాన్స్ కోసం ప్రత్యేక సందేశం!” Sat, Nov 08, 2025, 11:27 PM
“కింగ్: భారతదేశంలోనే అత్యంత ఖరీదైన యాక్షన్ మూవీ!” Sat, Nov 08, 2025, 11:02 PM
తెలుగు మూవీ, OTT డ్యూటీ: రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు Sat, Nov 08, 2025, 10:23 PM
మనశ్శాంతి కోసం స్మశానానికి వెళ్తా - హీరోయిన్ కామాక్షి భాస్కరాల Sat, Nov 08, 2025, 07:50 PM