మంచి సినిమాల జాబితాలో ఎవరు

by సూర్య | Wed, Aug 14, 2019, 12:23 PM

తెలుగు సినిమా కొత్తపుంతలు తొక్కుతోంది జాతీయస్థాయిలో తెలుగు సినిమా సంచలనాలకు వేదికైందని నిర్మాత పీవీపీ అన్నారు. అడివి శేష్‌, రెజీనా, నవీన్‌చంద్ర ప్రధాన తారాగణంగా వెంకట్‌ రామ్‌జీ దర్శకత్వంలో పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కెవిన్‌ అన్నె నిర్మించిన ఎవరు చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక మంగళవారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా నిర్మాత పీవీపీ మాట్లాడుతూ, ఎవరు చిత్ర ప్రయాణాన్ని మొదలుపెట్టి రెండేళ్లు అవుతోంది. ఈ చిత్రబృందంలోని అందరికీ తమ ప్రతిభను నిరూపించు కోవాలనే తపన, ఆకలి ఏర్పడ్డాయి. మా సినిమా గురించి నేను మాట్లాడటం కంటే ప్రేక్షకులు చూసి మాట్లాడాలి. తెలుగులో జెర్సీ, బ్రోచేవారెవరు రా, ఆత్రేయ వంటి చాలా మంచి సినిమాలు వచ్చాయి. అలాగే మంచి సినిమాల జాబితాలో ఎవరు భాగమవుతుందని అనుకుంటున్నాను అని అన్నారు. హీరో అడివి శేష్‌ మాట్లాడుతూ, నిన్న రాత్రి నేను, వెన్నెల కిషోర్‌..ఇంకా కొంతమంది మిత్రులం కలిసి ఈ సినిమా చూశాం. సినిమా అయిపోగానే వెన్నెల కిషోర్‌ హగ్‌ చేసుకోవడంతో నాలో చిత్రంపై మరింత నమ్మకం పెరిగింది. ఈ సినిమాను పరిశ్రమకు సంబంధం లేని ఓ వెయ్యిమందికి చూపించాం. మాకు వచ్చిన ఫీడ్‌బ్యాక్‌తో సినిమాను మరింత బెటర్‌ చేస్తూ వచ్చాం. ఓ సందర్భంలో ఇక మేం మాట్లాడటానికి ఏమీ లేకుండా వాళ్లే వచ్చి చాలా బావుందని చెప్పుకుంటూ వచ్చారు. తప్పకుండా ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో రెజీనా, నవీన్‌చంద్ర, శ్రీచరణ్‌ పాకాల, పలువురు చిత్రబృందం పాల్గొన్నారు.


 

Latest News
 
కీలక షెడ్యూల్ ని పూర్తి చేసుకున్న 'మిస్టర్ బచ్చన్' Thu, Apr 18, 2024, 07:18 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' USA రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Thu, Apr 18, 2024, 07:16 PM
'కల్కి 2898 AD' గురించిన లేటెస్ట్ అప్డేట్ Thu, Apr 18, 2024, 07:14 PM
'మా నాన్న సూపర్ హీరో' విడుదల అప్పుడేనా? Thu, Apr 18, 2024, 07:11 PM
50 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసిన 'వర్షంగల్కు శేషం' Thu, Apr 18, 2024, 07:10 PM