by సూర్య | Tue, Aug 13, 2019, 07:02 PM
సినీ హీరో నాగశౌర్యకు ట్రాఫిక్ పోలీసులు జరిమానా విధించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో ఆయన తన కారు అద్దాలకు బ్లాక్ ఫిల్మ్ వేసుకొని ప్రయాణిస్తున్నారు. దీన్ని గమనించిన పంజాగుట్ట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రవి ఆ కారును ఆపి రూ.500 జరిమానా విధించారు. అనంతరం కారుకు వేసిన బ్లాక్ ఫిలింను తొలగించారు.
నాగశౌర్య ఇటీవల ‘ఓ బేబీ’ సినిమాతో మంచి విజయం అందుకున్నారు. అగ్ర కథానాయిక సమంత టైటిల్ రోల్లో నటించిన సినిమా ఇది. నందినిరెడ్డి దర్శకత్వం వహించారు. నాగశౌర్య ప్రస్తుతం తన తర్వాతి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో ఆయనకు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ఐరా క్రియేషన్స్ పతాకంపై నాగశౌర్య తల్లి ఉషా ముల్పూరి నిర్మిస్తున్నారు. రమణ తేజ దర్శకుడు.
Latest News